యూకే కొత్త వీసా రూల్స్... ఇండియన్స్ కు కష్టమే..

 

ఇకనుండి యూకే వెళ్లడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఇండియన్స్... అందులోనూ ఐటీ రంగానికి చెందినవారు. ఎందుకంటే యునైటెడ్ కింగ్‌డ‌మ్ ప్ర‌భుత్వం త‌మ వీసా నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసింది. యూకే హోమ్ ఆఫీస్ ఈ కొత్త రూల్స్‌ను ప్ర‌క‌టించింది. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫ‌ర్ (ఐసీటీ) కేట‌గిరీలో వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే ప్రారంభ‌ వేతనం 30 వేల పౌండ్లు ఉండాల్సిందే. ఇంత‌కుముందు ఇది 20800 పౌండ్లుగా ఉండేది. ఈ కొత్త నిబంధ‌న న‌వంబ‌ర్ 24 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఐసీటీ కేట‌గిరీలో బ్రిట‌న్‌లో ఉండే ఇండియ‌న్ ఐటీ కంపెనీలే ఎక్కువ శాతం వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేస్తుంటాయి. ఇందులో సుమారు 90 శాతం వాటా ఇండియ‌న్ ఐటీ కంపెనీల‌వేన‌ని యూకే మైగ్రేష‌న్ అడ్వైజ‌రీ క‌మిటీ (ఎంఏసీ) వెల్ల‌డించింది.