యూకే కొత్త వీసా రూల్స్... ఇండియన్స్ కు కష్టమే..
posted on Nov 4, 2016 12:49PM
ఇకనుండి యూకే వెళ్లడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఇండియన్స్... అందులోనూ ఐటీ రంగానికి చెందినవారు. ఎందుకంటే యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం తమ వీసా నిబంధనలను కఠినతరం చేసింది. యూకే హోమ్ ఆఫీస్ ఈ కొత్త రూల్స్ను ప్రకటించింది. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ (ఐసీటీ) కేటగిరీలో వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రారంభ వేతనం 30 వేల పౌండ్లు ఉండాల్సిందే. ఇంతకుముందు ఇది 20800 పౌండ్లుగా ఉండేది. ఈ కొత్త నిబంధన నవంబర్ 24 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఐసీటీ కేటగిరీలో బ్రిటన్లో ఉండే ఇండియన్ ఐటీ కంపెనీలే ఎక్కువ శాతం వీసాల కోసం దరఖాస్తు చేస్తుంటాయి. ఇందులో సుమారు 90 శాతం వాటా ఇండియన్ ఐటీ కంపెనీలవేనని యూకే మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (ఎంఏసీ) వెల్లడించింది.