చెన్నై సెంట్రల్ లో బాంబు పేలుళ్లు: గుంటూరు యువతి మృతి

 

 

 

చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో బాంబు పేలుళ్లు సంభవించాయి. గౌహతీ-బెంగళూరు ఎక్స్ ప్రెస్ లో ఉదయం సరిగ్గా 7.12గంటలకు ఆ రైలులో యస్4 బోగీలో మొదటి ప్రేలుడు జరగగా మళ్ళీ రెండు నిమిషాల వ్యవధిలోనే అంటే 7.15గంటలకు పక్కనున్న యస్.5 బోగీలో మరో ప్రేలుడు జరిగింది. ఈ పేలుడులో ఓ యువతి మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన యువతి గుంటూరు జిల్లాకు చెందిన స్వాతి(22)గా గుర్తించారు. గాయపడినవారిలో విశాఖకు చెందిన యువతి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేలుడు జరిగిన సంగతి తెలుసుకోగానే అక్కడికి చేరుకొన్న రైల్వే పోలీసులు, అధికారులు గాయపడినవారిని హుటాహుటిన స్థానిక రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు.