క్లైమాక్స్ కి చేరిన కాంగ్రెస్- టీడీపీ పొత్తు.. కీలక నేతల భేటీ

 

హైదరాబాద్‌లోని‌ పార్క్‌హయత్‌ హోటల్‌లో ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తదితరులతో టీడీపీ తెలంగాణ రాష్ట్రఅధ్యక్షుడు రమణ తదితరులు సమావేశమయ్యారు.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పొత్తులపై చర్చిస్తున్నట్టు సమాచారం.. ఈ భేటీతో పొత్తులపై ప్రాథమిక అవగాహనకు వచ్చే అవకాశముంది.. తెరాసను ఎలాగైనా ఓడించేందుకు మహాకూటమి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు నిర్ణయించాయి.. దీనిలో భాగంగా ఇప్పటికే టీడీపీ.. సీపీఐ, టీజెఎస్ తో చర్చలు జరిపింది.. తాజాగా పార్క్‌ హయత్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ నేతలతో టీడీపీ నేతలు భేటీ అయ్యారు.. ఈ కీలక భేటీలో రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో బలాబలాలు, మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.