సిరిసిల్లలో ఓడిన అభ్యర్థులను రూంలో వేసి తాళం వేసిన పోలీసులు!!

సిరిసిల్లలో ఫలితాల కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల వైఖరి అందరిని ఆగ్రహానికి గురి చేస్తొంది.మున్సిపాలిటీలో ఓడిపోయిన అభ్యర్థులను పోలీసులు ఓ రూమ్ లో వేసి తాళాలు వేయడం కలకలం రేపుతోంది. ఓడిపోయిన వారందరు బయటకు వెళితే గొడవలు చేస్తారనే ముందుచూపుతో ఇలా చేశామంటున్నారు పోలీసులు. ఇది కావాలని అధికార పార్టీ చేయిస్తోందని ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ 24 సీట్లు,కాంగ్రెస్ 2 సీట్లు, బీజేపీ 3 సీట్లను ఇతరులు 10 సీట్లను సొంతం చేసుకున్నారు.

ఓడిపోయిన వారు కౌంటింగ్ ప్రదేశం నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా.. అక్కడి పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడున్న అధికారులకు పోలీసులకు మధ్య గట్టి వివాదం చోటుచేసుకుంది. వారిని బయటకు పంపితే ఇరు నేతల మధ్య వివాదాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నందునే తాము ఇలాంటి చర్యలకు పాటు పడాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. మొత్తం మీద పోలీసుల చర్యలతో ఓడిపోయిన నేతలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.