ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎ‌స్‌లో చేరలేదా...

 

నలుగురు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ గురువారం నాడు టీడీపీని విడిచిపెట్టి టీఆర్ఎస్‌లో చేరారు. గురువారం ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు సీఎంని కలసి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో చేరిన వారిలోఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, చల్లా ధర్మారెడ్డి, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ గంగాధర్ వున్నారు. అనంతరం పార్టీ మారిన ఈ ఐదుగురూ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధించేందుకే టీడీపీని విడిచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరామని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ కష్టాలకు ప్రభుత్వం ఎంతమాత్రం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కష్టాలకు గత ప్రభుత్వాలతోపాటు చంద్రబాబు విధానాలు కూడా కారణమని వారు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని వారు ఈ సందర్భంగా విమర్శించారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఎల్.రమణ ఈ విషయంలో కొత్త మలుపు తిప్పారు. ప్రకాష్ గౌడ్, ధర్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరలేదని తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు.