కాంగ్రెస్ లో విలీనానికి కేసిఆర్ సిద్దం..!!

 

 

 

కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీన౦ దాదాపు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ విలీనానికి సుముఖంగా వున్నట్లు సమాచారం. నిన్న ఢిల్లీలో వరుస భేటిలతో బిజీగా గడిపిన కేసిఆర్, దిగ్విజయ్ సింగ్ తో విలీనం, పొత్తులపై చర్చించారు. గతంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ లో పార్టీని వీలినం చేస్తారని ప్రకటించారు. ఈ అంశంపై ఇరు వర్గాల మధ్య ఒక అవగాహన కూడా కుదిరినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని, ఎన్నికల్లో పార్టీకి ఆయనే విజయ సారథ్యం వహిస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే కేసిఆర్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలా లేక కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలా అనే దానిపై ఇద్దరి మధ్య ఇంకా స్పష్టతా రాలేదని అంటున్నారు. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టతా వచ్చే అవకశాలు కనిపిస్తున్నాయి. ఆ తరువాత తెలంగాణలో భారీ బహీరంగసభ ఏర్పాటు చేసి వీలినం ప్రకటన చేయనున్నారు.