టీఆర్ఎస్ నాయకుడి కిడ్నాప్!

 

 

 

కాంగ్రెస్ – టీఆర్ఎస్ నాయకుల మధ్య విభేదాలు కిడ్నాపుల వరకు చేరుకున్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు, నీటి సంఘం మాజీ ఛైర్మన్ సంజీవరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌లో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానిక ఎన్నికల సందర్భంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు సంజీవరెడ్డిని కిడ్నాప్ చేశారని టీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.