మునిగిన ఓడలో 30 కిలోల బంగారం దొరికింది

 

 

 

ఒక ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఆ ఓడ నుంచి 300 కిలోల బంగారం బయటకి తీసుకొచ్చారు. అయితే ఇందులో వెరైటీ ఏమిటంటే, సదరు ఓడ మునిగిపోయి ఇప్పటికి 157 సంవత్సరాలు. 1857 సంవత్సరంలో దక్షిణ కెరోలినా ప్రాంతంలోని సముద్రంలో అమెరికాకి చెందిన ఎస్.ఎస్. సెంట్రల్ అనే పేరున్న ఒక పెద్ద స్టీమర్ మునిగిపోయింది. ఆ ప్రమాదంలో 425 మంది చనిపోయారు. ఈ ఓడలోనే అమెరికాలోని కేలిఫోర్నియా నుంచి తెప్పిస్తున్న 300 కిలోల బంగారం వుండిపోయింది. ఇంతకాలం ఆ ఓడను చేరుకునే అవకాశం లేకపోవడం వల్ల ఆ బంగారం బయటకి రాలేదు. ఈమధ్యకాలంలోనే సదరు ఓడలోని బంగారాన్ని బయటకి తీసుకువచ్చారట.