కరోనా ట్రైన్ ఎంత మంది ప్రాణాల్ని బలితీసుకోనుందో!
posted on Mar 31, 2020 9:18AM
ఈ నెలలో ఆంధ్ర, తెలంగాణాకు చెందిన సుమారు 1500 మంది ఢిల్లీలో మూడు రోజుల ఇస్తమా ముగిసిన తరువాత సామూహికంగా ట్రైన్లలో తిరిగివచ్చారు. వీరిలో 300 మంది హైదరాబాదులో కొంతమంది విజయవాడ గుంటూరు లో మరియు చీరాల లో 80 మంది ఒంగోలులో 200 మంది దిగినట్టు సమాచారం. ఇంకా రాష్ట్రంలో ఎక్కడ ఎక్కడ ఎంత మంది దిగారో తెలియదు.
ఇప్పటి వరకు విదేశాలనుంచి వచ్చినవారి అడ్రసు లు ఎయిర్ పోర్ట్ ద్వారా సేకరిస్తే ఇప్పుడు ట్రైన్ లో ప్రయాణించిన వారి వివరాలు సేకరించటం పెద్ద విషయం కాదు. మల్లపల్లి లో తబ్లీక్ జమాత్ హెడ్క్వార్టర్ మసీద్ వుంది. మెయిన్రోడ్డు మీద చౌరాస్తాలోనే వుంది. అక్కడ వీరందరి సమాచారం వుంటుంది. జమాత్ వాళ్ళు ఓ పద్దతి ప్రకారం పని చేస్తారు. కాబట్టి ఢిల్లీ వెళ్లిన ప్రతి ఒక్కరి పేరు, ఫోన్నెంబర్, అడ్రస్తో సహా సమాచారం వీరి వద్ద వుంటుంది. పోలీసులు వెళ్లి ఈజీగా ఈ సమాచారం తీసుకోవచ్చు.
వీరి అడ్రసు ల కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు.వీరి గుర్తింపు లో జాప్యం జరిగితే భారీ మూల్యం చెల్లించక తప్పదు. వీరిలో చీరాల నవాబ్ పేట మరియు పేరాల మసీదు సెంటర్ దగ్గర వాళ్ళు అక్కడ కు వెళ్ళి వచ్చిన వారే. విదేశాల నుండి వచ్చి క్వారంటైన్ లో ఉన్నవారికి రిపోర్టు లు నెగిటివ్ రాగా డిల్లీ నుంచి వచ్చిన వారివి మాత్రం పాజిటివ్ వస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ గుంటూరు మాచర్ల చీరాల కేసులు అవే. దీనికి వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.