శివాజీ ఏ పార్టీకి చెందినవాడో? కామినేని

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ సినీ నటుడు శివాజీ గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిన్నటి నుండి మూడు రోజులపాటు నిరాహార దీక్షకు కూర్చోన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ముందుకి కానీ వెనక్కి గానీ వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న ఎన్డీయే ప్రభుత్వానికి, బీజేపీకి చెందిన శివాజీయే ఈవిధంగా ఇబ్బంది పెట్టడంతో బీజేపీ నేతలు అతనిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కామినేని శ్రీనివాసరావు, బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరి తదితరులు మీడియాతో మాట్లాడుతూ శివాజీ కేవలం ప్రజల, మీడియా దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశ్యంతోనే నిరాహార దీక్షకు కూర్చోన్నారని విమర్శించారు. తను ఏ పార్టీలో ఉన్నారో ముందు తేల్చుకోవాలని మంత్రి కామినేని అంటే, అసలు అతను బీజేపీకి చెందినవాడు కాడని పురందేశ్వరి వ్యాక్యానించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని, కానీ అందరికీ తెలిసిన కొన్ని ఇబ్బందుల వల్లనే ఆలస్యం అవుతోందని ఆమె అన్నారు.