టీజేఎస్ తొలి విడుత అభ్యర్థులు వీరే..!!

 

మహాకూటమిలో కాంగ్రెస్,టీడీపీ,సీపీఐ పార్టీలు తమ పార్టీల తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు టీజేఎస్ మాత్రం తమ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు గడువు కూడా ముగియనుండటంతో ఆ పార్టీ తాజాగా తొలి విడుత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాలను రేపు ప్రకటిస్తామని ఆ పార్టీ తెలిపింది. మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్‌ 94, తెదేపా 14, తెజస 8, సీపీఐ 3 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి.

టీజేఎస్ తొలి విడుత అభ్యర్థుల జాబితా:

1. మల్కాజ్‌గిరి- కపిలవాయి దిలీప్‌కుమార్‌
2. దుబ్బాక- రాజ్‌కుమార్‌
3. సిద్దిపేట- భవానీరెడ్డి
4. మెదక్‌- జనార్దన్‌రెడ్డి