తిరుపతి టీడీపీ అభ్యర్థి సుగుణ?

 

తిరుపతి తెలుగుదేశం శాసనసభ్యుడు వెంకట రమణ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి ఆయన భార్య సుగుణకు తెలుగుదేశం టిక్కెట్ ఇచ్చి గెలిపించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టు తెలుస్తోంది. వెంకట రమణకు ఇద్దరు కుమార్తెలు వున్నారు. అయితే వారిద్దరూ బధిరులే. అందువల్ల వెంకట రమణ భార్యకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. భర్త దూరమైనప్పటికీ నిబ్బరంగా వ్యవహరిస్తూ, కుమార్తెలకు ధైర్యం చెబుతున్న సుగుణను తిరుపతి టీడీపీ అభ్యర్థిగా నిలపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సుగుణ విద్యాధికురాలు. ఇంగ్లీష్ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. సమర్థురాలైన సుగుణను ఉప ఎన్నికలలో నిలబెట్టడం దాదాపు ఖాయమని సమాచారం.