షిర్డీ - కాకినాడ రైల్లో దోపిడీ

 

షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో శుక్రవారం తెల్లవారుఝామున దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని రొట్టేగావ్ రైల్వే స్టేషన్ సమీపంలో దోపిడి దొంగలు ఎస్ 3, ఎస్ బోగీలలోని ప్రయాణికులపై దాడి చేసి, వారికి మారణాయుధాలతో బెదిరించి పది తులాల బంగారు నగలు, పెద్ద మొత్తంలో నగదును, పలు విలువైన వస్తువులను దోచుకున్నారు. దోపిడీ తర్వాత చైన్లాగి దొంగలు రైలు దిగి పరారైయ్యారు. ప్రయాణికులు దోపిడీ దొంగల బీభత్సంపై రైల్వే గార్డుకు సమాచారం అందించారు. అనంతరం రోట్టేగావ్ రైల్వే స్టేషన్ పోలీసులకు దోపిడీ బాధితులు ఫిర్యాదు చేశారు. రైలులో భద్రతా సిబ్బంది లేకపోవడంతో ఈ దోపిడీ దొంగలు చొరబడ్డారని ప్రయాణికులు ఆరోపించారు.