తెలంగాణలో కరోనా మరొకరి ప్రాణాలను బలి తీసుకుంది!

కొత్త‌గా  ఆరు పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. తెలంగాణలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2 చేరింది. సోమ‌వారంనాడు కొత్త‌గా ఆరుగురికి పాజిటివ్ రావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 77కు పెరిగింది. . అయితే క‌రోనాబారిన ప‌డి చికిత్స‌పొంది పూర్తిగా కోలుకున్న 13 మందిని డిశ్చార్జ్ చేశారు. నెగిటివ్ రిపోర్ట్ రావ‌డంతో చెస్ట్ హాస్పిటల్ లో చికిత్స పొందిన వీరిని వారి వారి ఇళ్ల‌కు పంపిన‌ట్లు సోమ‌వారం రాత్రి విడుద‌ల చేసిన హెల్త్ బులెటిన్ లో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

2 మరణాలు, 14 మంది కోలుకున్న వారిని మినహాయిస్తే.. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 61. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో కరీంనగర్‌కు చెందిన రెండు కేసులు కూడా ఉన్నాయి.