కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ తాళాలు పగులగొట్టి తనిఖీలు.. ఉద్రిక్తత

 

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ తాళాలు, తలుపులను ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్వ్కాడ్ పగులగొట్టిన విషయం సంచలనం కలిగించింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోగల కాంగ్రెస్ కార్యాలయాన్ని ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు గురువారం ఉదయం పరిశీలించారు. అయితే.. ఆ సమయంలో కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో వాటిని పగులగొట్టి లోపలికి ప్రవేశించి తనిఖీలు నిర్వహించారు. ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురై ఒక అధికారిని నిర్బంధించారు. అతన్ని విడిపించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. కాగా.. టీఆర్ఎస్ పార్టీ కుట్రలో భాగంగానే అధికారులు తాళాలు పగులగొట్టారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.