పాతబస్తీలో టెన్షన్

 

Tension in old city, Tension prevails in Hyderabad Old City, Tension in Indian city

 

బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగి రేపటితో 20 సంవత్సరాలు పూర్తి అవుతాయి. దీనితో పాత బస్తీ లో అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో, ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రేపు పాతబస్తీ లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఆ ప్రాంతంలోని స్థానికులతో సహా వ్యాపారులు భయపడుతున్నారు. దీనితో ఈ ప్రాంతంలో స్కూళ్ళు, కళాశాలలతో సహా వ్యాపార సంస్థలూ రేపు స్వచ్చందంగా మూతపడే అవకాశం ఉంది.



ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను నియమించారు. గత ఏడాది డిసెంబర్ 6 న ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగకపోయినా , ఈ ఏడాది జరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇటీవల భాగ్య లక్ష్మి ఆలయ కమిటీకి, ఎంఐఎం పార్టీ కార్యకర్తలకు మధ్య విభేదాలు తలెత్తి అవి అల్లర్లకు దారి తీయడమే ఈ అనుమానాలకు కారణం. పోలీసుల అనుమతి లేకుండా, ఈ ప్రాంతంలో ఎలాంటి సభలూ, సమావేశాలు నిర్వహించకూడదని నగర పోలీసు కమీషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. రేపు పాతబస్తీలో 144 వ సెక్షన్ అమల్లో ఉంటుందని కమీషనర్ ప్రకటించారు.