బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా ఇచ్చింది టీడీపీనే

సామాజిక మార్పు తెచ్చిన పార్టీ టిడిపి అని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనేది టీడీపీ సిద్ధాంతమని చంద్రబాబు అన్నారు. విద్యాధికులను రాజకీయాల్లోకి తెచ్చిన పార్టీ టీడీపీ అని... బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసింది కూడా టీడీపీనే అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

దేశంలో, రాష్ట్రంలో వివిధ పార్టీల మధ్య, ఆయా ప్రభుత్వాల మధ్య ‘‘తెలుగుదేశానికి ముందు, తెలుగుదేశం తర్వాత’’ అనే సరికొత్త యుగాన్ని ఆరంభించింది టీడీపీ అని అన్నారు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు కార్యకర్తలకు గుర్తు చేశారు.. అంత స్పష్టమైన పనితీరును కనబర్చడమే కాకుండా... 38ఏళ్లుగా అదే పనితీరుతో ముందుకు పోతోందని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయని.... మనదేశంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా బెడద రోజురోజుకూ తీవ్రం అవుతోందని చంద్రబాబు అన్నారు. పార్టీ సిద్దాంతాలకు పునరంకితం కావాలని కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు.