తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

 

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దబండిరేవులో శుక్రవారం నాడు సూరయ్య అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను వేసిన పంటకు నీరు లేక, బోరు వేయడానికి కరెంటు లేక సూరయ్య ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడలో ఓ రైతు తాను పండిస్తున్న వరి పంటకు నిప్పు పెట్టాడు. తాను సాగు చేస్తున్ వరి పంట విద్యుత్ కోతల కారణంగా ఎండిపోయిందని, అందువల్లే పంటకు నిప్పు పెట్టానని రైతు తెలిపాడు.