మైక్ పెట్టాడని పూజారి ప్రాణం తీసిన యువకులు

 

కొన్ని సంఘటనలు చూస్తే అసలు ఈ సమాజం ఎటు వెళ్తుందా? అని బాధ వేస్తుంది. అలాంటి కంటతడి పెట్టించే సంఘటనల్లో ఇది ఒకటి. దేవుడి తరువాత దేవుడిలా చూడాల్సిన పూజారిపైన నలుగురు యువకులు గుడిలోనే దేవుడి సాక్షిగా దాడి చేసారు. చివరికి ఆ పూజారి ప్రాణం విడిచి ఆ దేవుడి చెంతకే చేరిపోయారు. వరంగల్ లోని పోచం మైదానం వద్ద వున్న శివసాయి బాబా ఆలయంలో గత శనివారం దేవల సత్యనారాయణ అనే వృద్ధ పూజారి పూజలు చేస్తున్నారు. అయితే ఈ సమయంలో ఒక వర్గానికి చెందిన నలుగురు యువకులు ఆలయంలోకి వచ్చారు. వస్తూనే తమ ప్రార్థనకు ఆటంకం కలిగించేలా మైక్ ఎందుకు పెడుతున్నావంటూ వాగ్వివాదానికి దిగి పూజారిని చితకబాదారు. వారి దెబ్బలకు ఆయన తీవ్రంగా గాయపడటంతో భక్తులు ఎంజీఎంకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం బుధవారం నిమ్స్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఆయన కన్నుమూశారు.