తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటాం: లగడపాటి

 

telangana lagadapati, kcr telangana, lagadapati telangana issue

 

 

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తెలంగాణపై శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అలా ప్రవేశపెట్టే అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడమే మా లక్ష్యం అని లగడపాటి అన్నారు. సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు ఎటు ఓటేస్తారో తేల్చుకోవాలి అని ఆయన అన్నారు. టీడీపీ లేఖ వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చింది అని ఆరోపించారు. తెలుగుతల్లి మెడపై కత్తిపెట్టారు, అందరూ మేల్కోవాలి అని అన్నారు. తెలంగాణ వస్తే తను రాజకీయాల్లో ఉండను అని స్పష్టం చేశారు. అయితే మెజార్టీ ప్రజల ఆంకాక్షకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరించొద్దు అని ఆయన అశాభావం వక్తం చేశారు. మరి ఈయన ఆశలు ఫలించేనా…