తెలంగాణ పై ఆజాద్‌తో కిరణ్ భేటి!

 

Kiran Kumar Reddy Ghulam Nabi Azad, telangana Kiran Kumar Reddy, Ghulam Nabi Azad telangana

 

 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బెంగళూరులో కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌తో రహస్యంగా భేటి అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆజాద్‌తో సమావేశమైనట్లు సమాచారం. ఈ భేటి లో తెలంగాణాపై ఆజాద్‌తో కిరణ్ అరగంట పాటు చర్చించినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదాన్ని బలపరుస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కిరణ్ కలవాల్సి ఉన్నా.. ఆజాద్‌తో భేటీ అనంతరం ఆయన తిరిగి వెళ్లిపోయారు. తెలంగాణపై త్వరలో సీడబ్యూసీ కీలక భేటీ జరగనున్న నేపథ్యంలో ఆజాద్‌తో కిరణ్ సమావేశం కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.