తెలంగాణ వల్ల మెదక్ కు లాభం లేదు

 

telangana jagga reddy, congress telangana, telangana issue

 

 

ప్రత్యేక తెలంగాణ వల్ల మెదక్ జిల్లాకు ఎలాంటి లాభం లేదని మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే, విప్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సింగూరు, మంజీరా రిజర్వాయర్ లకు కర్ణాటక నుండి నీరు రావాలి. అక్కడ డ్యామ్ లు కట్టడం వల్ల ప్రస్తుతం నీరు రావడం లేదు. తెలంగాణ వచ్చాక ఎక్కడ నుండి నీరు తెస్తారు ? రాష్ట్రం సమైక్యంగానే ఉండాలి అని అన్నారు. మరి తెలంగాణ వద్దంటున్న మీరు టీఆర్ఎస్ నుండే మొదటిసారి గెలిచారని అంటే అది కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం పెట్టారని అన్నారు. మెదక్ జిల్లాకు నీరు రావాలంటే తమ జిల్లాను కర్ణాటకలో కలపాలని ఆయన కోరారు. మెదక్ నీటి గురించి అన్ని పార్టీలు నోరువిప్పి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.