మార్చి 2న తెలంగాణ విద్యార్థి సింహగర్జన

 

 

 telangana issue, telangana simhagarjana, separate telangana, ou jac

 

 

తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మార్చి 2న నిజాం కళాశాలలో తెలంగాణ విద్యార్థి సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఓయూ జేఏసీ శనివారం ప్రకటించింది. అలాగే, ఫిబ్రవరి 15న తెలంగాణ వ్యాప్తంగా సైకిల్ యాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. మార్చి 20న ఛలో అసెంబ్లీ ముట్టడికి ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది.విద్యార్థి జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఓయూ జేఏసీ నుంచి అభ్యర్థిని నిలబెడతామని తెలిపారు. త్వరలో అభ్యర్థి పేరు వెల్లడిస్తామన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది.