సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే

తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతలను సోమవారం వరకు ఆపాలంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారీ కట్టడాన్ని కూల్చడం సరికాదంటూ హైకోర్డులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం కూల్చివేతపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవానాల కూల్చివేత వల్ల వచ్చే కాలుష్యం ప్రజలకు ఇబ్బందికరంగా ఉందంటూ పిటిషనర్లు పేర్కొన్నారు. న్యాయవాది చిక్కడు ప్రభాకర్, ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన న్యాయ స్థానం సోమ‌వారం వ‌ర‌కు భ‌వ‌నాల కూల్చివేత‌ను ఆపాలంటూ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. సోమవారం మరోసారి విచారణ జరగనుంది. అయితే సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసు కూడా సోమవారం విచారణకు రానుంది.