ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ సాయం

హుదూద్ తుఫాను ధాటికి అల్లకల్లోలం అయిన ఉత్తరాంధ్రను ఆదుకోవడానికి అన్ని రంగాల నుంచి సాయం అందుతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందిస్తూ 18 కోట్ల విలువైన విద్యుత్ సామగ్రిని ఆంధ్రప్రదేశ్‌కి పంపింది. వీటిలో 530 ట్రాన్స్‌ఫార్మర్లు, 28,500 స్తంభాలు, 9 వందల కిలోమీటర్ల విద్యుత్ వైర్లు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.