తెలంగాణలో ష్ గప్ చుప్

 

 

ఈనెల 30వ తేదీన ఎన్నికలు జరుగనున్న తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సోమవారం సాయత్రానికి ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక తెలంగాణ ప్రాంతంలో ఏ పార్టీ కూడా ఎన్నికలకు సంబంధించిన మేటర్స్ మాట్లాడకూడదు. ఇతర పార్టీల మీద విమర్శలు చేయకూడదు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను ఎన్నికల కమిషన్ నిషేధించింది. టీవీ ఛానళ్ళలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రకటనలు కూడా ఇక ప్రదర్శించరాదు. సీమాంధ్రకు సంబంధించిన ప్రకటనలు కూడా తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకూ టీవీ ఛానళ్ళలో ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రదర్శించరాదని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.