కేసీఆర్‌కి ధైర్యం లేదు: లోకేష్

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ తెలంగాణ సీఎం కేసీఆర్ మీద మరోసారి ఘాటు విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతో చర్చించేందుకు కేసీఆర్కు ధైర్యంలేదని రుజువైందని లోకేష్ అన్నారు. తనకు చంద్రబాబుతో చర్చించే ధైర్యం లేక సమయం వృధా చేయడానికే చంద్రబాబుతో చర్చలకు తమ మంత్రులను పంపుతామంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని లోకేష్ ట్విట్టర్లో విమర్శించారు. తెలంగాణలోని పలు అంశాలపై చంద్రబాబుతో చర్చకు రావాలని లోకేష్ గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. దీనిపై తెలంగాణ మంత్రులు జగదీశ్ రెడ్డి స్పందించారు. చంద్రబాబుతో చర్చకు తాము సిద్ధమేనని ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.