తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: బాబు
posted on Jul 6, 2013 4:47PM
తెలంగాణపై మహానాడులో తీర్మానం చేశామని, తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ అమరులైనవారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణ విషయంలో మరింత స్పష్టత ఇస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. తాము అధికారంలోకి రాగానే రూ10వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. కేటీఆర్ వసూళ్లపై టీఆర్ఎస్ ఎందుకు నోరు విప్పదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అరాచకాలను ఎండగడతామని బాబు తెలిపారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కలుస్తాయని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ చేసి చూపిస్తామని బాబు వెల్లడించారు. టీడీపీ హాయంలో హైదరాబాద్ ఆదాయం పెరిగిందని తెలిపారు.