కన్నీరు పెట్టిన కనుమూరి, హర్ష కుమార్ ...

 

 

 

పార్లమెంట్ లో సీమాంధ్ర మంత్రులు వెల్ లో నినాదాలు జరుపుతున్నారు. వెల్ లోకి చిరంజీవి, కావూరి, పల్లంరాజు, పురందేశ్వరి, కోట్ల తమ నిరసనను తెలుపుతున్నారు. కేంద్రమంత్రులు కిల్లీ కృపారాణి, కిశోర్ చంద్రదేవ్, పనబాక మాత్రం ఎలాంటి ఆందోళనలు చేయకుండా కూర్చున్నారు. జైరాం రమేష్, ఆంటోనీ ఆందోళన చేస్తున్న మంత్రులకు నచ్చేచెప్పేందుకు ప్రయత్నించినా వారు వెనక్కి తగ్గలేదు. తమ గోడు ప్రధాని కానీ, సోనియా గానీ పట్టించుకోవడం లేదని బాపిరాజు, హర్షకుమార్ సభలోనే కన్నీరు పెట్టారు.