ఏపీ, తెలంగాణలకు మరో ఘనత... మొదటి ర్యాంకు

 

రెండు తెలుగురాష్ట్రాలు మరో ఘనతను సాధించాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సంయుక్తంగా తొలి ర్యాంక్‌ సాధించాయి. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా ఇప్పుడు మొదటిర్యాంకు సాధించింది. ఇక 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ ఏకంగా మొదటిస్థానానికి ఏగపాకింది. ఇక గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన గుజరాత్ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మొదటి ర్యాంకు సాధించగా.. మూడోస్థానంలో గుజరాత్‌, నాలుగో స్థానంలో ఛత్తీస్‌గఢ్‌, ఐదో స్థానంలో మధ్యప్రదేశ్‌ నిలిచాయి.