తెలంగాణ పై దిగ్విజయ్ కొత్త మెళిక

 

 Digvijay Singh Telangana, Telangana Digvijay Singh

 

 

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పై మాట మార్చినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణపై నివేదిక ఇచ్చిన తర్వాతే నిర్ణయం జరుగుతుందని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. విభజన, సమైక్యాంధ్రల పైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను అడిగామని, వారు నివేదిక ఇచ్చాకనే తెలంగాణపై నిర్ణయం ఉంటుందన్నారు. నివేదిక ఇవ్వడానికి ఓ గడువు అంటూ ఏమీ లేదని చెప్పారు నేతలు ఎప్పుడైనా వచ్చి  తమ నివేదికను తమకు ఇవ్వవచ్చునని ఆయన చెప్పారు. అయితే వారు నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్ణయం ఉంటుందన్నారు. నేతలు ఇచ్చే నివేదికకు గడువు లేదని చెప్పడం ద్వారా దిగ్విజయ్ తెలంగాణపై కొత్త మెలిక పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. కోర్‌కమిటీ సమావేశంలో తెలంగాణపై తుది నిర్ణయం ఉంటుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.