తెలుగుదేశం.. నారా టీడీపీ, నందమూరి టీడీపీగా చీలబోతుంది

 

ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ ముక్కలు కాబోతుందని ఇటీవల వైసీపీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఫలితాల తర్వాత టీడీపీ ముక్కలవుతుందని.. నారా టీడీపీ, నందమూరి టీడీపీగా నిలువునా చీలిపోతుందని అన్నారు. సైకిల్ కి పంక్చర్ అయిపోయిందని.. ఉనికి కోసమే ఇతర రాష్ట్రాల నేతలను చంద్రబాబు కలుస్తున్నారని ఎద్దేవా చేశారు. జాతీయ రాజకీయాల్లో ఉండేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారని అన్నారు. బీజేపీతో వైసీపీకి సంబంధం ఉందంటూ చంద్రబాబు చేసిన ప్రచారం చివరకు వైసీపీకి లాభం చేకూర్చిందని పేర్కొన్నారు. ఏపీలో లగడపాటి చెప్పిన సర్వే నిజమైతే... ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు చంద్రబాబు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చుతుందని, అది టీడీపీకి లాభిస్తుందనే చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టిందని అన్నారు.