సీమాంధ్ర విజయంతో టీడీపీలో ఆనందోత్సాహాలు

 

 

 

సీమాంధ్రలో ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. సీమాంధ్రలో 109 స్థానాల ఆధిక్యతని సాధించడంతోపాటు పార్లమెంట్ సీట్లలో బీజేపీ, టీడీపీ కూటమి 18 ఎంపీ స్థానాలలో ఆధిక్యను ప్రదర్శిస్తూ వుండటం పట్ల తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం స్థాపించే మెజారిటీ రాదని ముందుగానే తెలిసినప్పటికీ, తెలంగాణలో కూడా గౌరవప్రదమైన అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే దిశగా తెలుగుదేశం పయనిస్తూ వుండటం కూడా తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది. అటు సీమాంధ్రలో విజయం సాధించడంతోపాటు ఇటు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే అవకాశాలు వుండటంతో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.