రాజమండ్రి కార్పొరేషన్‌లో రాణిస్తున్న టీడీపీ

 

 

 

తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం దూకుడు కొనసాగుతోంది. అనేక మునిసిపల్ స్థానాల్లో తెలుగుదేశం ముందంజలో వుంది. జిల్లా కేంద్రమైన రాజమండ్రి కార్పొరేషన్‌లో తెలుగుదేశం విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం 50 కార్పొరేషన్ స్థానాలు వుండగా ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ 17 కార్పొరేషన్ స్థానాలు గెలుచుకుంది. వైకాపా 3 స్థానాల్లో, కాంగ్రెస్ 1 స్థానంలో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. మొత్తమ్మీద రాజమండ్రిలో రాణించేది తెలుగుదేశం పార్టీయే అనే విషయం స్పష్టమవుతోంది.