ఎంపీ కొనకళ్ల నారాయణకు గుండెపోటు

 

 

 

సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపీ కొనకళ్ల నారాయణ లోక్ సభలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. వాయిదా అనతంరం తిరిగి సభ ప్రారంభమైన వెంటనే సభలో కొనకళ్ల నారాయణ ఒక్కసారిగా గుండె పట్టుకొని కుప్పకూలిపోవడంతో ఆయనను వెంటనే రామ్ మనోహర్ లోహియా అసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అంతకముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ..సభలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను తెలిపే అవకాశం ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా తమపైన దాడి చేసిందని అన్నారు.