టీఆర్ఎస్ తేలుకుట్టిన దొంగలా ఎందుకుంది!

 

TDP Motkupalli Narasimhulu, Motkupalli Narasimhulu TRS, KTR Motkupalli Narasimhulu

 

 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశాంతంగా కూర్చోవడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణపై తీర్మానం అంటూ నిన్నటి వరకు రాద్దాంతం చేసి.. ఇప్పుడు ఎందుకు మౌనంగా కూర్చున్నారని మోత్కుపల్లి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే. తారక రామారావు సెటిల్‌మెంట్ దందాపై కథనం రావడంతో టీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. కెటిఆర్ కోసం తెలంగాణవాదాన్ని పక్కన పెట్టారన్నారు.కెసిఆర్ కుటుంబం మరో నిజాంను తలపిస్తోందన్నారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పుడు మరోసారి బయటపడిందన్నారు.చరిత్రలో ఏ ఉద్యమకారుడు అయినా ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకున్నారని, కెసిఆర్ మాత్రం ఉద్యమం పేరుతో కోట్లు దండుకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు.