టిడిపి ఎమ్మెల్సీ యాదగిరి కన్నుమూత

 

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి గుండెపోటుతో కన్నుమూశారు. శాసన మండలి సభ్యుడిగా ఉన్న ఆయన పదవీకాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. దాదాపు ఏడాది కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో యాదగిరి బాధపడుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో.. శనివారం సాయంత్రం 6.45 నిమిషాలకు స్వగృహంలోనే కన్నుమూశారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు జయరాం ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు.



పొగాకు యాదగిరి మరణం పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి యాదగిరి క్రియాశీలకంగా పనిచేశారని గుర్తుచేసుకున్నారు. యాదగిరి మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. యాదగిరి మృతికి సీఎం కిరణ్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, టీడీపీ నేతలు దేవేందర్ గౌడ్, టీఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు సంతాపం తెలిపారు.