నారా లోకేశ్ అర్హుడే.. దేవినేని

హైదరాబాద్ గండిపేటలో నిర్వహించిన తెదేపా 34న మహానాడు కార్యక్రమం ప్రారంభం అయింది. అనేక మంది తెదేపా నేతలు భారీ ఎత్తున ఈ మహానాడు కార్యక్రమానికి తరలివస్తున్నారు. అయితే ఈ మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేశ్ కు కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశాలు, ఓ ముఖ్యమైన పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ విషయంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నారా లోకేశ్ కు పదవి ఇవ్వడంలో తప్పులేదని, దానికి అతను అర్హుడేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని తాము కట్టుబడి ఉంటామని అన్నారు.