పోలీసులు క్షమాపణ చెప్పాలి.. టీడీపీ ఫ్లోర్ లీడర్ ఆందోళన..
posted on Oct 31, 2016 12:48PM
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు నిరసనకు దిగారు. తనతో పోలీసులు దుర్భాషలాడారంటూ ఆయన నిరసనకు దిగారు. వివరాల ప్రకారం..తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దీపావళి పండుగ సందర్భంగా నిన్న రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు దుకాణాలను మూయించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు ఇంటి సమీపంలో ఉన్న ఓ బేకరీని మూసేయాలని చెప్పారు. దీంతో శ్రీనివాసరావుకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆయన ఆందోళనకు దిగారు. పోలీసులు ఆయనకు నచ్చజెప్పే పయత్నం చేశారు. అయినా శ్రీనివాసరావు తన ఆందోళనను విరమించలేదు. నగర ప్రజల పట్ల పోలీసుల తీరు బాగోలేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని శ్రీనివాసరావు ఆరోపించారు. తనకు పోలీసులు బహిరంగ క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.