కేసీఆర్‌ - తలసాని ఏకాంత చర్చలు

 

తెలంగాణ తెలుగుదేశం పార్టీ సనత్ నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏకాంతంగా సమావేశమై చర్చలు జరిపారు. దాదాపు గంటసేపు వీరిరువురు చర్చలు జరిపారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఏకాంత సమావేశానికి ప్రాధాన్యత లభించింది. అయితే తలసాని వర్గీయులు మాత్రం మెట్రో రైలు కారణంగా ఆస్తులు కోల్పోతున్న వారికి న్యాయం జరగాలని కోరుతూ మాత్రమే తలసాని కేసీఆర్‌తో సమావేశమయ్యారని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.