అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. ఎంపీ గల్లాని చొక్కా పట్టి లాగి అరెస్ట్!!

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రైతులు అసెంబ్లీ కాంప్లెక్స్‌ను నలువైపులా చుట్టుముట్టారు. పోలీసుల ఆంక్షలు లెక్కచేయకుండా దూసుకెళ్లేందుకు రైతులు యత్నించారు. దీంతో పోలీసులు రైతులపై లాఠీఛార్జ్ కూడా చేశారు. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై కూడా పోలీసులు దాడికి దిగారు. గల్లా చొక్కాను చించారు. గల్లాను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో పోలీసులు ఆయనను లాగడంతో ఆయన చొక్కా చిరిగిపోయింది. దీంతో పోలీసుల తీరుపై గల్లా జయదేవ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని అన్నారు. మహిళలను విచక్షణారహితంగా పోలీసులు కొడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు తమ పోరాటాన్ని ఆపలేరని గల్లా స్పష్టం చేశారు.