అవనిగడ్డ ప్రజలకు అండగా ఉంటా: కంఠమనేని రవిశంకర్
posted on Mar 25, 2014 2:09PM
అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీలు, కులమతాలకతీతంగా పలు సేవాకార్యక్రమాలు, వైద్య సేవలు అందిస్తున్నారు తెలుగుదేశం నాయకులు, తెలుగువన్ ఫౌండేషన్ అధినేత కంఠమనేని రవిశంకర్. ప్రజలకు మరింత చేరువకావాలనే సంకల్పంతో గ్రామీణ ప్రాంత ప్రజలను పరిచయం చేసుకుంటూ, ఇంటింటికీ వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు మోపిదేవి, చల్లపల్లి, కోడూరు, ఘంటాశాల, నాగాయలంక మ౦డలాలలో ఆయన పర్యటించి ఆ గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఓటు హక్కు చాలా అమూల్యమైనదని, రానున్న ఎన్నికలలో నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడినే ఎన్నుకోవాలని సూచించారు.
మీడియాతో మాట్లాడుతూ.. అవనిగడ్డ నియోజకవర్గంలో వలసవాదులకు చోటు లేదని, ప్రజలకు కావాల్సింది వారి సమస్యలను తీర్చి, కష్టాల్లో అండగా నిలిచే నాయకుడని.. ఆ నాయకుడు తానే అవుతాననే ధీమాను కంఠమనేని రవిశంకర్ వ్యక్తం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు అవనిగడ్డ సీటును తనకు ఇస్తారనే నమ్మకం వుందని అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఆయన చేపట్టిన పరిచయ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.