తెదేపా ఎమ్మెల్యేలకు విప్ జారీ

 

రాష్ట్ర శాసనసభలో టి.ఆర్.ఎస్., వైఎస్సార్సీపీ విడివిడిగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈ అవిశ్వాస తీర్మానానికి తెదేపా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. అవిశ్వాస తీర్మానంపై ప్రతిస్పందిస్తూ వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతిస్పందిస్తూ "ఈ తీర్మానం నెగ్గాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కొనాలి, ప్రజాస్వామ్యాన్ని కొనాలి, ఆ పని నేను చేయలేను. తతంలో తమ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు. సూట్ కేసుల కోసం, ఖరీదైన కార్ల కోసం ఆశపడి ఎమ్మెల్యేలు అమ్ముడయ్యారు. గతంలో తాను చేసిన తప్పు మరలా పునరావృత్తం చేయనని'' అన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన టి.ఆర్.ఎస్. పై మండిపడుతూ "ఎమ్మెల్యేలను పశువుల మాదిరిగా కొంటున్నారు. అలాంటివాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడితే మేం సమర్థించాలా'' అని అన్నారు.