కేసీఆర్ ఆస్తులపై విచారణ జరపాలి: ఎర్రబెల్లి

 

tdp erra belli dayakar rao, kcr tdp, chandrababu kcr

 

 

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరిపించాలి. తెలంగాణ ప్రజలను రాజకీయ నేతలు మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో నేరమయ రాజకీయాలు పెరిగిపోతున్నాయి” అని తెలంగాణ తెలుగుదేశం పోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, నేతల భూకబ్జాలు, సెటిల్ మెంట్లను వ్యతిరేకిస్తు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ రోజు గన్ పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సెటిల్ మెంట్లు చేస్తున్నాడని ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ఈ ధర్నా ప్రాధాన్యం సంతరించుకుంది.