టిడిపి పవర్ దీక్ష
posted on Mar 27, 2013 12:41PM
పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేయాలని, వ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రత్యేక నిరసనదీక్షలు చేపట్టింది. మంగళవారం రాత్రి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ల లో 30 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. అసేంబ్లీ నుండి పాదయాత్రగా వేదిక వద్దకు చేరుకుని దీక్షలో కూర్చున్నారు. దీక్షలో రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ రాథోడ్, టిడిపి శాసనసభాపక్షం విప్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, సీనియర్ శాసనసభ్యులు కెఇ.కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, జి.జయపాల్ యాదవ్, పి.మహేందర్రెడ్డి, కె.ఎస్.రత్నం, కె.దయాకర్రెడ్డి, డి.అనసూర్య, ఎస్.వెంకటవీరయ్య, డి.ఉమామహేశ్వరరావు, శ్రీరామ్ రాజగోపాల్, కె.నారాయణరెడ్డి, పి.రఘునాథరెడ్డి, సీతక్క, సత్యవతి రాథోడ్, రత్నం, తుమ్మల నాగేశ్వరరావు, మంచిరెడ్డి కిషన్రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, ఎల్వీ రమణ, పి.కేశవ్, దేవినేని ఉమామహేశ్వరరావు, రేవూరి ప్రకాశ్రెడ్డి, శ్రీరాం తాతయ్య, పి.పుల్లారావు, జె.ఆంజనేయులు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అన్నపూర్ణమ్మ, ఉమామాధవరెడ్డి, బి.చందర్రావు, కె.లలితా కుమారి, ఎం.లింగారెడ్డి, హనుమంత్షిండే, అబ్దుల్ గని, నక్క ఆనంద్, శివరామరాజు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, కె.శ్రీధర్ తదితరులు దీక్షలో కూర్చున్నారు.