తెహల్కా తేజ్‌పాల్: మదర్ సెంటిమెంట్

 

 

 

తెహల్కా డాట్‌కామ్ స్ట్రింగ్ ఆపరేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తరుణ్ తేజ్‌పాల్ మదర్ సెంటిమెంట్‌ని గోవా కోర్టు గౌరవించింది. ప్రస్తుతం జైల్లో వున్న తరుణ్ తేజ్‌పాల్ గురువారం గోవా సమీపంలో ఒక గ్రామంలో వున్న తన తల్లిని చూసి రావడానికి అనుమతి ఇచ్చింది. తరుణ్ తేజ్‌పాల్ తల్లి గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. ఆమెని చూడాలని తరుణ్ తేజ్‌పాల్ గత కొంతకాలంగా తపిస్తున్నాడు. మార్చి 13వ తేదీన కోర్టు ఒకసారి తరుణ్ తేజ్‌పాల్‌కి తన తల్లిని చూసి రావడానికి అనుమతి ఇచ్చింది. ఇరవై రోజులు తిరక్కుండానే మరోసారి తరుణ్ తన తల్లిని చూడటానికి తనకి అవకాశం ఇవ్వాలని కోర్టును కోరాడు. అవసాన దశలో వున్న తల్లిని చూసే అవకాశం ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేశాడు. తరుణ్ సెంటిమెంట్‌ని అర్థం చేసుకున్న కోర్టు ఆయనకి మరోసారి అనుమతి ఇచ్చింది.