నీలి చిత్రాలు చూస్తూ అడ్డంగా బుక్కయిన మంత్రిగారు..


ఈ మధ్య రాజకీయ నేతలు కూడా ఫోన్ల వల్ల అడ్డంగా బుక్కవుతున్నారు. ఇప్పటికి చాలా మంది నేతలనే చూశాం. ఇప్పుడు మరో మంత్రి అడ్డంగా బుక్కయ్యారు.  కర్ణాటక పాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మంత్రి తన్వీర్‌ సేఠ్‌ తలంపులు తెచ్చే పనిచేసి అడ్డంగా దొరికిపోయారు. అది కూడా నీలి చిత్రాలు చూస్తూ.. వివరాల ప్రకారం..టిప్పు జయంతి సందర్భంగా గురువారం రాయచూరలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన  తన ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ దొరికిపోయారు. ఇక అంతా అయిపోయిన తరువాత దీనిపై స్పందించిన మంత్రి గారు... ‘తను ఇల్లు విడిచి మూడు నెలలు అయింద’ని నిసిగ్గుగా సమాధానం ఇచ్చారు. ఆ తరువాత వెంటనే... మైసూరుకు చెందిన తాను అక్కడ జరిగిన టిప్పు కార్యక్రమాలకు సంబంధించిన వీడియో చూసినట్టు బుకాయించారు. దీంతో ఇప్పుడు సిద్ధరామయ్య సర్కారు ఇరకాటంలో పడింది. తన్వీర్‌ సేఠ్‌ వ్యవహారంపై సిద్ధరామయ్యను రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ నివేదిక అడినట్టు సమాచారం.