ఆయన ఓ తేడా మనిషి.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొద్దిరోజులుగా సొంత పార్టీ వైసీపీని ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. పార్టీ నేతలు విమర్శించినా, పార్టీ నుంచి షోకాజ్ నోటిస్ వచ్చినా.. ఏ మాత్రం తడబడకుండా విమర్శకు కాస్త గోదావరి వెటకారం జోడించి కౌంటర్ ఇస్తున్నారు. అయితే తాజాగా రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ నేత, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక తేడా మనిషి అంటూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. ఆయనను తాము మనిషిలా గుర్తించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామ కృష్ణంరాజు బీజేపీకి వెళ్లిపోతున్నారు కనుకనే ప్రధాని మోడీ భజన చేస్తున్నారని నాగేశ్వరరావు ఆరోపించారు.