జయలలితను త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం...

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా జయలలిత ఆరోగ్యంపై పార్టీ నేతలు కానీ... వైద్య సిబ్బంది కానీ ఎలాంటి బులిటెన్ లు ప్రకటించడంలేదు. అయితే ఇప్పుడు అమ్మ ఆరోగ్యంపై అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... జయలలిత పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని.. ఆమెకు మెరుగైన వైద్యం అందుతోందని, ఇన్ ఫెక్షన్ పూర్తిగా తగ్గిందని, త్వరలో డిశ్చార్జి చేస్తామని చెప్పారు. కాగా, సెప్టెంబర్ 22న జ్వరం, ఇన్ ఫెక్షన్ తో చెన్నై అపోలో ఆసుపత్రిలో జయలలిత చేరారు. ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో పలు వదంతులు కూడా వ్యాపించాయి.