జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవీణ్ కుమార్ రెడ్డి

 

 

 

చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి తెలుగు దేశం పార్టీ ఎంఎల్ఎ ప్రవీణ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న కొత్తకోట లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షం లో ఆయన జగన్ పార్టీలో చేరారు. విజయమ్మ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

‘తన స్వార్ధ ప్రయోజనాల కోసం చంద్ర బాబు పార్టీని నాశనం చేశారు. గత 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేసినవారిని బయటకు వెళ్ళగొట్టారు’, అని ప్రవీణ్ ఈ సందర్భంగా అన్నారు. భారత దేశం లో ఏ నాయకుడు చేయలేని సంక్షేమ పధకాలను వై ఎస్ అమలు చేసి చూపించారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ రాష్ట్ర మఖ్య మంత్రి కావడానికి అందరూ కృషి చేయాలని ప్రవీణ్ కార్యకర్తలను కోరారు.

 

ఎన్ టి ఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టిన కొత్తలో తంబళ్ళపల్లి లో ఆ పార్టీ ఓడిపోయిందని, తమ కుటుంబానికి టికెట్ ఇచ్చాకే ఇక్కడ ఆ పార్టీ గెలిచిందని ప్రవీణ్ గుర్తు చేశారు. ఇక తెలుగు దేశం పార్టీ కనుమరుగవుతుందని ప్రవీణ్ అన్నారు. తెలుగు దేశం, కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కు అయి, జగన్ ను జైలుకు పంపారని ఆయన అన్నారు.